టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (14:14 IST)
చైనా కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనీస్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌లలో దాదాపు రూ.70 కోట్లు ఆఫర్ చేసింది. ఐతే ఈ బోనస్ తీసుకుని వెళ్లేందుకు ఒకే ఒక షరతు పెట్టింది. టేబుల్ పైన 70 కోట్ల డబ్బు పెడతామనీ, అందులో మీరు కేవలం పావుగంటలో ఎంత డబ్బు లెక్కించగలుగుతారో అంతా తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పింది.
 
ఇంకేముంది... ఉద్యోగులందరూ వీలైనంత ఎక్కువ డబ్బును లెక్కించేందుకు ఎగబడ్డారు. ఒక ఉద్యోగి అందరికంటే ఎక్కువగా పావుగంటలో దాదాపు రూ.12.07 లక్షలు లెక్కించి పట్టుకెళ్లాడు. దీనిని సోషల్ మీడియాలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు కంపెనీ దాతృత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ విధానాన్ని ప్రశ్నించారు. దీనిపై ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... ఈ సర్కస్ ఫీటుకి బదులుగా మీరు కార్మికుడి ఖాతాల్లోకి జమ చేయవచ్చు. ఉద్యోగుల విషయంలో ఇది ఒక రకమైన అవమానకరమైనది అంటూ పేర్కొన్నాడు.
 
హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments