Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో మునిగిన థాయ్‌లాండ్ యుద్ధనౌక

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:24 IST)
థాయ్‌లాండ్‌కు చెందిన భారీ యుద్ధనౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై 31 మంది గల్లంతయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో సముద్రతీరానికి 20 నాటికన్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధ నౌక సోమవారం సాయంత్రం మునిగిపోయింది. 
 
ఈ యుద్ధ నౌక గస్తీలో నిమగ్నమైవుండగా, బలమైన ఈదురుగాలులు వీయడంతో ఓ చిగురుటాకులా వణికిపోయింది. అదేసమయంలో ఓడలోకి నీరు వచ్చి చేరింది. ఈ నీటికి బయటకు పంపే ప్రయత్నం సిబ్బంది చేసినప్పటికి ఆ చర్యలు ఫలించలేదు. పైగా, నౌకలోకి నీటి పోటు అధికం కావడంతో అది మునిగిపోయింది.
 
ఈ నౌక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాయల్ నేవీ బోట్లు, హెలికాఫ్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని నౌకలో 106 మంది సిబ్బందిలో 75 మందిని రక్షించారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో నౌక అర్థరాత్రి సమయంలో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గల్లంతైన వారిని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నట్టు రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ ఫోకరోంగ్ మోంథపలిన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments