జ్యూస్ అనుకుని సోప్ సొల్యూషన్ తాగారు.. అంతే ఆస్పత్రిలో...?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:24 IST)
చైనాలో జ్యూస్‌ని ఆర్డర్ చేసిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. అంతేగాకుండా జ్యూస్‌కు బదులు సబ్బు ద్రావణాన్ని తాగారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో ప్రముఖ రెస్టారెంట్ నడుస్తోంది. ఆ రెస్టారెంట్‌లో వుగాంగ్ అనే మహిళ తన బంధువులు, ఆరుగురు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ జ్యూస్ ఆర్డర్ చేశారు. 
 
సప్లయర్ ఇచ్చిన జ్యూస్ తాగేసరికి గొంతులో మంట వచ్చింది. దీంతో వారందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. వారిని పరీక్షించిన వైద్యులు సబ్బు ద్రావణం తాగినట్లు పరీక్షల్లో తేలింది. 
 
సప్లయర్‌కు కంటిచూపు లోపం ఉందని, డబ్బా జ్యూస్ బాటిల్‌లా ఉండడంతో పొరపాటున సోప్ సొల్యూషన్ పోశాడని రెస్టారెంట్ వారు వివరణ ఇచ్చారు. 
 
అలాగే, చైనాలో చాలా సోప్ సొల్యూషన్ డబ్బాలు రంగులు జ్యూస్ బాటిళ్లను పోలి ఉన్నందున గందరగోళంగా ఉన్నాయని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments