Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠకు తెరపడింది.. శ్రీలంక ప్రధానిగా రణిలి విక్రమ సింఘే

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (14:43 IST)
దాదాపు రెండు నెలలుగా కొలంబోలో కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెరపడింది. శ్రీలంక దేశ ప్రధానిగా రాణిల్ విక్రమసింఘే మరోమారు బాధ్యతలు స్వీకరించారు. 51 రోజుల క్రితం ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే విక్రమసింఘేతో ఇపుడు ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్‌లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. 
 
శనివారం మహిందా రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘేకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. ఆ రోజు ప్రధానిగా ఉన్న విక్రమసింఘేను తొలగించి రాజపక్సేను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్సే నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు. శుక్రవారమే విక్రమసింఘేతో ఫోన్‌లో మాట్లాడిన సిరిసేన.. ఆయనను మరోసారి ప్రధానిని చేయడానికి అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments