Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం : అల్‌ఖైదా హెచ్చరిక

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:18 IST)
భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ముస్లిం దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. 
 
ఈ నేపథ్యంలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భారత్‌కు గట్టి హెచ్చరిక చేసింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ ఉగ్ర సంస్థ ప్రతినిధులు ఓ లేఖను విడుదల చేశారు. 
 
"మా ప్రవక్తను కించపరిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేవాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురు చూడాలి" అంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments