Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం : అల్‌ఖైదా హెచ్చరిక

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:18 IST)
భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ముస్లిం దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. 
 
ఈ నేపథ్యంలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భారత్‌కు గట్టి హెచ్చరిక చేసింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ ఉగ్ర సంస్థ ప్రతినిధులు ఓ లేఖను విడుదల చేశారు. 
 
"మా ప్రవక్తను కించపరిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేవాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురు చూడాలి" అంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments