వివేకా హత్య కేసు : వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద సీబీఐ సర్వే

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (09:05 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుసయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద సీబీఐ అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు. 
 
అదేసమయంలో వివేకా పీఏ ఇనయతుల్లాను మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటితో పాటు ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తదితరుల ఇళ్ళ వద్ద కూడా సర్వే నిర్వహించి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారు. 
 
ఇందుకోసం మంగళవారం ఉదయం 10.30 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి ఇనయతుల్లాను సీబీఐ అధికారులు పిలిపించి విచారించారు. ఆ తర్వాత ఇనయతుల్లాతో పాటు ప్రభుత్వ సర్వేయరు, వీఆర్పో, ప్రైవేట్ ఫోటోగ్రాఫర్‌లను సీబీఐ అధికారులు వెంటబెట్టుకుని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. 
 
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి బయట సర్వే చేశారు. అలాగే, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి బయట, ఈసీ గంగిరెడ్డి పాత ఆస్పత్రి వద్ద సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి  శంకర్ రెడ్డి, భరత్ యాదవ్, ఈసీ గంగిరెడ్డి, రంగన్న ఇళ్లు వైకాపా కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సర్వే నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments