సౌతాఫ్రికాలో భారత సంతతి వైరాలజీ శాస్త్రవేత్త మృతి

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (11:59 IST)
కరోనా మహమ్మారి ఎందరో అమాయికుతో పాటు... అనేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులను పొట్టనబెట్టుకుంటుంది. ఈ వైరస్ బారినపడి తిరిగి కోలుకోలేక వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ చనిపోయారు. తాజాగా సౌతాఫ్రికాలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈమె పేరు గీతా రాంజీ. ప్రముఖ వైరాలజీ శాస్త్రవేత్త. 
 
ఈమెకు కరోనా వైరస్ సోకడంతో కన్నుమూశారు. ఈమె వయసు 64 యేళ్లు. హెచ్ఐవీ ప్రివెన్షన్ రీసర్చ్ టీమ్‌కు లీడర్‌గా ఉన్నారు. వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన ఆమె... వారం క్రితమే లండన్ నుంచి డర్బన్‌కు తిరిగొచ్చారు. 
 
ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. 
 
గీతా రాంజీ అంత్యక్రియలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దక్షిణాఫ్రికాలో 21 రోజుల లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరయ్యే జనాల సంఖ్యపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. అంత్యక్రియల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments