Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు : అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 22 మే 2023 (13:34 IST)
అంతర్జాతీయ వేదికపై ప్రధానంమత్రి నరేంద్ర మోడీ తన మనసులోని ఆవేదనను బహిర్గతం చేశారు. ఇండియా - పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం పశ్చిమాశియా దేశాల పేర్లను ప్రస్తావించకుండానే పరోక్ష విమర్శలు గుప్పించారు. నమ్మిన వాళ్లే తమను అవసరానికి ఆదుకోలేక పోయారని వాపోయారు. ప్రస్తుతం ఆయన న్యూగినియా దేశంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ సందర్భంగా ఆయన ప్రపంచపై కొవిడ్ ప్రభావం గురించి మాట్లాడారు. కొవిడ్ ప్రభావం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషియానా దేశాలపై అధికంగా ఉందన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, పేదరికం, ఆరోగ్యపరమైన సమస్యలకు తోడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 
 
అయితే, ఆపదసమయాల్లో భారత్ తన మిత్రదేశాలకు ఎప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు. ఈ క్రమంలో మోడీ పాశ్చాత్య దేశాలపై పరోక్ష విమర్శలు చేశారు. 'ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తాయి. ఈ కష్టసమయంలో, మేం నమ్మినవాళ్లే మమ్మల్ని అవసరానికి ఆదుకోలేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments