భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఐవీఆర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (20:13 IST)
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు సాగుతున్నాయి. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆఫ్ఘన్ ఆరోపిస్తుండగా దానికి భారత్ మద్దతిస్తోంది. ఇలా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో దగ్గరవ్వడంతో పాకిస్తాన్ ఉలికిపాటుకు గురవుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా నోటికొచ్చిన చెవాకులు పేలారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
భారతదేశ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఉద్రిక్తతలు ఎదురైతే ఏం చేస్తారంటూ పాక్ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఆ విషయాన్ని కొట్టి పారేయలేం. ఐతే ఈ రెండు దేశాలతో యుద్ధం చేయగల సత్తా మాకు వుంది. ఆ వ్యూహాలు మాకు వున్నాయి. ఐతే వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. పాకిస్తాన్ దేశం పైన దాడులు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో వున్నారు. భారతదేశం ఆదేశాల మేరకే ఆఫ్ఘన్ తమపై దాడులు చేస్తోందంటూ విచిత్ర వాదన చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments