Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా? - స్వీయ నిర్బంధంలోకి....

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (13:29 IST)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు అబ్దుల్ ఎది కుమారుడు, ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఫైసల్‌ ఎదిని కలిశారు. ఆ తర్వాత ఆ దాతకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కూడా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 
 
దాతకు కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశ ప్రధానికి కూడా పాక్ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఇమ్రాన్ నుంచి శాంపిల్స్ సేకరించారు. స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ ప్ర‌కారం శ్యాంపిళ్లు సేక‌రించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. పాజిటివ్ వ్య‌క్తిని ఇమ్రాన్ క‌లిసినందుకు ఈ ప‌రీక్ష త‌ప్ప‌లేదు. 
 
పాక్ ప్రధానిని కలిసిన దాత... 10 మిలియన్ల చెక్కును అందజేశారు. క‌రోనా సోకిన వ్య‌క్తితో ఓ గదిలో 15 నిమిషాలు మాట్లాడినా, లేక అత‌నికి ఆరు అడుగుల దూరంలో ఉన్నా వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డింది. 
 
ఇద్ద‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకోక‌పోయినా.. అందుకున్న చెక్ నుంచి వైర‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్‌కు ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments