Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌తో పెట్టుకుంటే అంతేమరి.. పీసీబీకి రూ.కోట్ల నష్టం.. ఎలా? (video)

భారత్‌తో పెట్టుకుంటే అంతేమరి.. పీసీబీకి రూ.కోట్ల నష్టం.. ఎలా? (video)
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (12:57 IST)
భారత్‌తో పెట్టుకున్నందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ మూల్యమే చెల్లించుకుంది. భారత గడ్డపై ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లుఆడేందుకు నిరాకరించినందుకు పీసీబీ ఇపుడు ఏకంగా రూ.691 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 
 
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొనివున్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దాయాది దేశాలైనప్పటికీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. పైగా, ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్‌ల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 
 
అదేసమయంలో 2008 నుంచి ద్వైపాక్షిక సిరిస్‌లను పాకిస్థాన్‌ రద్దు చేసుకుంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చివరి ఐదేళ్ల ఒప్పందం గడువు ఈనెలతో ముగియనుంది. ఈలోగా రెండు ద్వైపాక్షిక సిరిస్‌లు ఆడాల్సి ఉంది. 
 
కానీ పాకిస్థాన్‌ వచ్చి తమ దేశ ఆటగాళ్లు ఆడరని బీసీసీఐ తేల్చిచెప్పడంతో టెన్ స్పోర్ట్స్, పిటివి మీడియా కుదుర్చుకున్న 149 మిలియన్ డాలర్ల ఒప్పందంలో రావాల్సిన 90 మిలియన్ డాలర్ల (రూ.691 కోట్లు)ను ఆదేశం నష్టపోయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెడిసికొట్టిన గంగూలీ ప్రయత్నాలు.. ఐపీఎల్ నిరవధిక వాయిదా