Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్

గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై ఇప్పటికే పది మిల

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:23 IST)
గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై ఇప్పటికే పది మిలియన్ డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తనను గృహ నిర్భంధం చేసింది భారత దేశం కాదని సయీద్ అన్నాడు.
 
కాశ్మీర్ సమస్య నుంచి తనను దూరంగా ఉంచాలని పాకిస్థాన్ సర్కారు భావించిందని లాహోర్ జరిగిన ఓ కార్యక్రమంలో సయీద్ తెలిపాడు. గతంలో తనను మోదీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం నిర్భంధించిందని ఆరోపించిన సయీద్ ప్రస్తుతం మాట మార్చారు. 
 
కాగా 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో సయీద్ కీలక సూత్రధారి కావడంతో భారత్, అమెరికా తీవ్ర ఒత్తిడి కారణంగా తనను నిర్భంధించినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం తనను పాకిస్థానే పదినెలల పాటు నిర్భంధించిందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments