చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామా

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులను చంపేయాలని.. వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివల్ కోరారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు సత్యాగ్రహం చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఎనిమిది నెలల చిన్నారిపై ఢిల్లీలో జరిగిన అకృత్యం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసిన స్వాతి..చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని.. అలాంటి విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
 
కామాంధుడి అఘాయిత్యానికి గురైన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని.. ప్రధాని దృష్టి అటు వైపు మళ్లించేందుకే ఈ లేఖను రాసినట్లు స్వాతి పేర్కొన్నారు. ఇంతకుముందు రెండేళ్లుగా ప్రధాని మోదీకి రాసిన లేఖల్లో ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. మహిళలు అందరికీ మీరే దిక్కు.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మోదీపై వుందని లేఖలో స్వాతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments