Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై పాకిస్థాన్‌ తీరు మారాల్సిందే: చైనా ఫైర్

భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (11:07 IST)
భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తుందనే వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికి మంచివి కావని చైనా వ్యాఖ్యానించింది. 
 
అంతకుముందు.. చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందని, పాక్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ జుబిర్‌ మహమ్మద్‌ హయత్ ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా సీపీఈసీ ప్రాజెక్టుపై కుట్ర‌లు ప‌న్నుతూ త‌మ‌ వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ హింస‌ను సృష్టించాల‌ని చూస్తుందన్నారు. 
 
ఇందులో భాగంగా భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్ (రా) ఒక జట్టును కూడా త‌యారు చేసింద‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. పాకిస్థాన్ ఆరోపణలను తప్పుబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments