Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై పాకిస్థాన్‌ తీరు మారాల్సిందే: చైనా ఫైర్

భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (11:07 IST)
భారత్‍పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలపై చైనా స్పందించింది. ప్రతి విషయంలోనూ భారత్‌పై పాకిస్థాన్ నిందలు వేస్తోందని.. పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై భారత్ గూఢచర్యం చేస్తుందనే వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికి మంచివి కావని చైనా వ్యాఖ్యానించింది. 
 
అంతకుముందు.. చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందని, పాక్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌ జనరల్‌ జుబిర్‌ మహమ్మద్‌ హయత్ ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా సీపీఈసీ ప్రాజెక్టుపై కుట్ర‌లు ప‌న్నుతూ త‌మ‌ వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ హింస‌ను సృష్టించాల‌ని చూస్తుందన్నారు. 
 
ఇందులో భాగంగా భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్ (రా) ఒక జట్టును కూడా త‌యారు చేసింద‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. పాకిస్థాన్ ఆరోపణలను తప్పుబట్టింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments