Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్జీలు తగ్గించాలంటూ తాలిబన్ల హుకుం .. నిలిచిన పాక్ ఫ్లైట్ సర్వీసులు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:37 IST)
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతూ వచ్చిన విమాన సేవలను నిలిపివేసింది. విమాన చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో నిలిపివేస్తామని తాలిబన్ పాలకులు పాకిస్థాన్‌ను హెచ్చరించారు. దీంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఊహించని నిర్ణయం తీసుకుంది. కాబూల్‌కు నడుపుతున్న అన్ని రకాల విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
టికెట్ ధరలను తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబూల్ - ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లుగా ఉంది.
 
ఈ నేపథ్యంలో మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలని తాలిబన్లు ఆదేశించారు. టికెట్ ధరలను తగ్గించలేని పీఐఏ విమాన సర్వీసులను రద్దు చేసింది. తాము మానవతా దృక్పథంతోనే విమాన సర్వీసులు నడుపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. 
 
బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, తమ సిబ్బందిని తాలిబన్లు భయపెడుతున్నారని పీఐఏ ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments