Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెక్ర‌టేరియేట్ నుంచి మాట్లాడుతున్నా.... అగంతుకుడి బ్లాక్ మెయిల్!

సెక్ర‌టేరియేట్ నుంచి మాట్లాడుతున్నా.... అగంతుకుడి బ్లాక్ మెయిల్!
విజయవాడ , మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:28 IST)
ఒక్కోసారి ప్ర‌భుత్వ అధికారులు మైండ్ అస‌లు ఉప‌యోగించ‌రు. ఈజీగా మోస‌గాళ్ళ‌ ట్రాప్ లో ప‌డిపోతారు. ఇలానే, టోక‌రా వేశాడో అగంత‌కుడు... దీనితో తెలంగాణా జిల్లా రంగారెడ్డి అధికారులు తెల్ల‌ముఖం వేశారు. త‌మ వ‌ద్ద అధికారికంగా లిస్ట్ తీసుకుని, తీరిక‌గా ఆ ఆగంత‌కుడు ఉద్యోగుల‌ను బ్లాక్ మెయిల్ చేశాడ‌ని గ్ర‌హించారు. 
 
సెక్రటేరియేట్ నుండి మాట్లాడుతున్నా అని రంగారెడ్డి కలెక్టరేట్ కు ఫోన్ కాల్స్ చేసాడో అగంతకుడు. జిల్లాలో సస్పెండ్ అయిన వి.అర్.వోలు, జూనియర్ అసిస్టెంట్ ల‌ వివరాలు ఇవ్వాలని ఫోన్ చేశాడు. లిస్ట్ ప‌ట్టుకుని తానే సచివాలయం వద్దకు తీసుకొస్తామని ఆ ఉన్నత అధికారి బ‌దులిచ్చాడు. వ‌ద్దు త‌న‌కు వాట్సప్ లో డేటా పంపండి అని అగంతకుడు మెసేజ్ చేశాడు. అంతే, ఆగమేఘాల మీద రంగారెడ్డి కలెక్టరేట్ నుండి డేటాను మొత్తం ఆగంతకుడికి పంపేశారు. 
 
క‌ట్ చేస్తే... ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కో సస్పెండ్ అయిన ఉద్యోగికి ఆగంతుకుడు ఫోన్ కాల్స్ చేశాడు. మీకు మళ్ళీ ఉద్యోగం కావాలంటే, తనకు కొంత చెల్లించాలని డిమాండు చేశాడు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేయ‌డ‌మే కాకుండా, ప్రమోషన్ కూడా ఇప్పిస్తా అని నమ్మబలికాడు అగంతకుడు. తాము పర్సనల్ గా కలిసి డ‌బ్బు ఇస్తామ‌ని, త‌మ బాధ‌లు చెప్పుకుంటామ‌ని పలువురు ఉద్యోగులు ఆ ఆగంతుకుడిని బ‌తిమిలాడుకున్నారు. కానీ, కోవిడ్ కారణంగా క‌ల‌వ‌లేన‌ని, గూగుల్ పే, ఫోన్ పే చేయాలని కోరాడు ఆ ఆగంతకుడు.
 
అనుమానం వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్ లో కొంద‌రు ఉద్యోగులు ఆరా తీశారు. స‌స్పెండ్ అయిన ఉద్యోగుల‌ డేటా మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ నుండి వెళ్లిందని ఆ అధికారి అస‌లు క‌థ చెప్ప‌డంతో ఇదంతా ఎవ‌డో బ్లాక్ మెయిల‌ర్ ప‌ని అని అర్ధం అయింది. త‌మ‌కు ఫోన్ చేసిన వ్య‌క్తి ఆచూకి కోసం సచివాలయంలో ఎంక్వయిరీ చేస్తే, అటువంటి వ్యక్తి ఎవ‌రూ లేకపోవడంతో మోస‌పోయామ‌ని తెలుసుకున్నారు. చివ‌రికి సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట మునిగిన సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్