Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజర్ మసూద్ ఆస్తులు ఫ్రీజ్ చేయండి : పాకిస్థాన్ నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:28 IST)
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన లష్కర్ ఏ తోయిబా అధినేత మసూద్ అజర్‌పై చర్యలకు పాకిస్థాన్ ఉపక్రమించింది. పలు దేశాలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ముద్రపడిన మసూద్ అజర్, అంతర్జాతీయ ఉగ్రవాదేనని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి చైనా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 
 
దీంతో పాకిస్థాన్ చర్యలకు దిగింది. ఇందులోభాగంగా, మసూద్ ఆస్తులను జప్తు చేయాలని, ఆయన ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. ఆంక్షల కమిటీ విధించే నిబంధనలకు అనుగుణంగా మసూద్‌‌పై చర్యలు ఉంటాయని ఈ నోటిఫికేషన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. 
 
మసూద్ విదేశీ ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. భద్రతా మండలి నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నామని, నిబంధనల మేరకు ఆంక్షలను తక్షణమే అమలు చేయనున్నామని పేర్కొంది.
 
కాగా, మసూద్‌ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై చైనా కూడా అభ్యంతరం తెలపకపోవడంతో రెండు రోజుల క్రితం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments