Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో హిందూ విద్యార్థిని మృతి.. కరాచీ వీధుల్లో భగ్గుమన్న నిరసనలు

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:46 IST)
పాకిస్థాన్ దేశంలో ఓ హిందూ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. దీంతో ఆ దేశంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు కరాచీ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. 
 
పాక్‌లోని లర్ఖానా ప్రాంతానికి చెందిన నమ్రితా చందాని అనే యువతి వైద్య విద్యను అభ్యసిస్తూ ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయింది. లర్ఖానాలోని బబీ అసిఫా దంత వైద్య కాలేజీలోని తన హాస్టల్‌ గదిలో నమ్రితా విగతజీవిగా కనిపించింది. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టడంతో అనుమానాస్పదంగా తేలింది. 
 
మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్‌ విశాల్‌ సుందర్‌ ఆరోపిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు పెరిగిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతితో పాక్‌లో నిరసనలు భగ్గుమన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments