Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొజాంబిక్ తీరంలో విషాదం.. పడవ మునిగి 90 మంది జలసమాధి!!

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (11:42 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు జలసమాధి అయ్యారు. జాలర్లు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో 90 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి 130 మంది వరకు ఉన్నట్టు సమాచారం. బోటులో కెపాసిటీకి మించి జాలర్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. అయితే, మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన తీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళుతున్నట్టు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళుతుండగా ఈ పడవ మునిగిందని చెబుతున్నారు. ఇదిలావుంటే, మొజాంబిక్ దేశంలో గత యేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 15 వేల కలరా కేసులు వెలుగు చూశాయి. అలాగే, 32 మంది మృత్యువాతపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments