నైజీరియాలో మారణహోమం - చర్చిలోని భక్తులపై కాల్పులు - 50 మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:31 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైనా నైజీరియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న భక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు తెగబడ్డారు. బాంబులు విసిరారు. దీంతో 50 మందికి వరకు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఆ తర్వాత చర్చి ఫాస్టర్‌ను కిడ్నాప్ చేశారు. ఈ మారణహోమం ఓండో రాష్ట్రంలోని సెయిట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో జరిగింది. 
 
ఆదివారం కావడంతో ఈ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఫాస్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. చర్చిపై బాంబులతో దాడి చేసి మరోవైపు కాల్పులు జరిాపరు. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా మారింది. ఈ దాడిలో ఎంత మంది మరణించారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. కానీ, దాదాపు 50 మంది వరకు చనిపోయినట్టు మీడియా కథనాల సమాచారం. 
 
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రం గర్భందాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని అన్నారు. ఏది ఏమైనా ఈ దేశం ఎన్నటికీ దుష్టులకు తలొగ్గదన్నారు. చీకటి ఎప్పటికీ వెలుగునివ్వలేదన్నారు. చివరికి నైజీరియా గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. అయితే, ఈ మారణహోమానికి ఏ ఒక్క సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments