Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుధ పరీక్షతో సత్తా చాటిన ఉ. కొరియా...

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (10:40 IST)
మరోమారు ఆయుధ పరీక్షతో ఉత్తర కొరియా మరోమారు సత్తా చాటింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా ఈ ఆయుధ ప్రయోగ పరీక్షను వీక్షించడం గమనార్హం. 
 
ఈ విషయాన్ని ఉత్తర కొరియా ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు సాగిస్తున్న దక్షిణ కొరియాతో చర్చలు జరిపేది లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
అమెరికా, దక్షిణ కొరియాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక విన్యాసాలు ముగిసిన తర్వాత అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ కిమ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఉత్తర కొరియా ఈ మేరకు స్పందించడం గమనార్హం. 
 
మరోవైపు, అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఐఎన్‌ఎఫ్‌ (ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ట్రీటీ) ఒప్పందం రద్దయింది. న్యూ స్టార్ట్‌ (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం)కు కాలం చెల్లిపోయిందని ట్రంప్‌ సర్కార్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి అమెరికాకు సవాల్‌ విసరడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments