Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా వద్దన్న పాపానికి అమ్మనే చంపేశాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:38 IST)
స్మార్ట్ ఫోన్లపై నేటి యువతకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే పిజ్జాలు, బర్గర్లు అంటే తెగ ఇష్టపడుతున్నారు. తమకు కావలసిన వస్తువులు, ఆహార పదార్థాల కోసం యువత దేనికైనా సిద్ధపడుతున్నారు. వద్దంటే తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. కానీ ఇక్కడొకడు పిజ్జా ఆర్డర్ చేసుకుంటానంటే తల్లి వద్దని చెప్పిందని.. ఆమెను హతమార్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన నళిని (51) భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోని నార్త్ కరోలోనాలో స్థిరపడ్డారు. నళిని కుమారుడు ఆర్నవ్.. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. దీన్ని గమనించిన నళిని అతని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. దీన్ని తెలుసుకున్న ఆర్నవ్ తల్లిని శత్రువుగా చూడటం మొదలెట్టాడు. ఆమెపై పగను పెంచుకున్నాడు.
 
ఓసారి పిజ్జా వద్దని చెప్పినా ఆర్డర్ చేశాడని ఆర్నవ్‌ను నళిని కోపంతో చెంపపై కొట్టింది. దీంతో ఆవేశానికి గురైన ఆర్నవ్ ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. ఆస్పత్రికి ఆర్నవ్ తీసుకెళ్లలేకపోవడంతో నళిని ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై మైనర్ కావడంతో ఇన్నాళ్లు కేసు నమోదు చేయని పోలీసులు.. గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఆర్నవ్ తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments