నేనేం తప్పు చేయలేదు.. ఏ ఒక్క బ్యాంకును మోసం చేయలేదు: మాల్యా

భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (10:17 IST)
భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల్యా లాయర్లు ఇలా చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని.. అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవేనన్న విషయాన్ని మాల్యా లాయర్లు కోర్టు ముందు వెల్లడించారు. 
 
యూబీ గ్రూప్ మాజీ ఛైర్మన్, రూ.9వేల కోట్లకు పైగా రుణాలు వేసి.. వాటిని తీర్చకుండా బ్రిటన్ పారిపోయి విజయ్ మాల్యా చేసిన తప్పేమీ లేదన్నారు.  తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని, అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవని వాదిస్తూనే, ఆయన ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. 
 
కింగ్ ఫిషర్ కోసం రుణాలు తీసుకోకముందు, ఆ తర్వాత క్రూడాయిల్ ధరలు పెరిగిన విషయాన్ని లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యాపారం విఫలమైందని అందుకే తాము నష్టపోయామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, కేసు విచారణను వాయిదా వేసింది.

మరోవైపు విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలని లండన్ వెళ్లిన సీబీఐ.. ఈడీ బృందాలు తదుపరి దశలో మరింత గట్టిగా వాదనలు వినిపించేందుకు సై అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments