Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనేం తప్పు చేయలేదు.. ఏ ఒక్క బ్యాంకును మోసం చేయలేదు: మాల్యా

భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (10:17 IST)
భారత్‌లోని ఏ ఒక్క బ్యాంకును కూడా తాను మోసం చేయలేదని విజయ్ మాల్యా అన్నారు. వ్యాపారంలో నష్టం వస్తే తామేం చేయగలమని తెలిపారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో తన అప్పగింతపై వాదనలు జరుగుతున్న వేళ మాల్యా లాయర్లు ఇలా చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని.. అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవేనన్న విషయాన్ని మాల్యా లాయర్లు కోర్టు ముందు వెల్లడించారు. 
 
యూబీ గ్రూప్ మాజీ ఛైర్మన్, రూ.9వేల కోట్లకు పైగా రుణాలు వేసి.. వాటిని తీర్చకుండా బ్రిటన్ పారిపోయి విజయ్ మాల్యా చేసిన తప్పేమీ లేదన్నారు.  తమ క్లయింట్ ఏ ఒక్క రూపాయిని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని, అవి ఓ కంపెనీ పేరిట తీసుకున్నవని వాదిస్తూనే, ఆయన ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. 
 
కింగ్ ఫిషర్ కోసం రుణాలు తీసుకోకముందు, ఆ తర్వాత క్రూడాయిల్ ధరలు పెరిగిన విషయాన్ని లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యాపారం విఫలమైందని అందుకే తాము నష్టపోయామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం, కేసు విచారణను వాయిదా వేసింది.

మరోవైపు విజయ్ మాల్యాను ఎలాగైనా భారత్‌కు తీసుకురావాలని లండన్ వెళ్లిన సీబీఐ.. ఈడీ బృందాలు తదుపరి దశలో మరింత గట్టిగా వాదనలు వినిపించేందుకు సై అంటోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments