Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యాకు న్యూఇయర్ షాక్- ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:12 IST)
బ్యాంకు రుణాలు ఎగొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబయి ప్రత్యేక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది.

అయితే ఈ ఆదేశాలను అపీలు చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వుల అమలుపై జవవరి 18 వరకు స్టే విధించింది. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కొత్త సంవత్సరాది రోజునే ఎదురుదెబ్బ తగిలింది.

జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు. అయితే ఉత్తర్వులను కోర్టు జనవరి 18 వరకు నిలిపివేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై సంబంధిత పక్షాలు(మాల్యా) బొంబాయి హైకోర్టులో అపీలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

జప్తు చేసిన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకుల కన్సార్టియంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇదివరకే ప్రత్యేక కోర్టుకు తెలిపింది ఈడీ. 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ. 6,203.35 కోట్లకు ఆస్తుల వేలం నిర్వహించాలని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments