నేపాల్‌లో కోవిడ్-19 వ్యాప్తికి భారతే కారణం.. ప్రధాని కేపీ ఓలీ విమర్శలు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:16 IST)
Nepal PM
నేపాల్‌లో కోవిడ్-19 వ్యాప్తికి భారతే కారణమని ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. 
 
భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కొవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎక్కువ మందికి సోకుతోంది' అని ఓలీ ఆరోపించారు.
 
భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవేనని కేపీ శర్మ ఓలీ అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments