Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాకు తప్పిన సునామీ ముప్పు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (09:02 IST)
సముద్ర దీవి ప్రాంతమైన ఇండోనేషియాకు మరో సునామీ ముప్పు తప్పింది. బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ దీవిలోని కెపులవన్ బరత్ దయాలో ఈ భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 6.4గా నమోదయ్యాయి. 
 
యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ లెక్కల ప్రకారం భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. అయితే, అర్థరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు గృహాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారని అధికారులు వెల్లడించారు. 
 
భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. ఇదిలావుంటే, జనవరి 19వ తేదీన ఇండోనేషియాలో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అమహైకి సమీపంలోని 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జావా ద్వీపంలో కూడా భూ కదలికలు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments