Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న గోరుముద్ద చిక్కిపై సమస్యా? ఆదిమూలపు ఏమన్నారు..?

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:25 IST)
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై ఫైర్ అయ్యారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కిపై వస్తున్న వివాదంపై స్పందించారు.
 
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 
 
నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని తెలిపారు. గ్లోబల్ టెండర్ ప్రకారం చిక్కి సరఫరా జరుగుతోందని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేయడం సహేతుకం కాదని హితవు పలికారు. 
 
కోవిడ్ జాగ్రత్తలో భాగంగా ప్రతీ విద్యార్థికి 25 గ్రాముల చిక్కి ప్యాకెట్‌ను వ్యక్తిగతంగా ఇస్తున్నాం.. ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి..' అని మంత్రి ఆదిమూలపు సూచించారు. పీఆర్సీ అంశాలపై ముందుకే వెళ్లాలని.. గడియారం వెనక్కు తిరగడం కుదరదని గుర్తించాలన్నారు.
 
ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నామని మంత్రి అన్నారు. ఏ సమస్య అయినా చర్చలతోనే సాధ్యం అవుతుందన్నారు. 
 
టీడీపీ హయాంలో నీళ్ల సాంబారు, చిన్న సైజు గుడ్లు సరఫరా చేశారని విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments