Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై కంగనా రనౌత్ ఫైర్

Advertiesment
Kangana Ranaut
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:42 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడోపై విరుచుకుపడింది. 2020 సంవత్సరంలో.. భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు ట్రూడో మద్దతునిచ్చాడనే విషయాన్ని గుర్తు చేసింది. 
 
కెనడా ప్రధాని ట్రూడో భారతీయ నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు తన దేశంలో రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు.. ఎందుకంటే నిరసనకారులు వారి భద్రతకు ముప్పుగా ఉన్నారు. ఎవరి కర్మకు వారే బాధ్యులని తెలిపింది. 
 
2020లో, జస్టిన్ ట్రూడో భారతదేశంలో రైతుల నిరసనకు తన మద్దతును అందించాడు, "రైతుల నిరసన గురించి భారతదేశం నుండి వస్తున్న వార్తలపై నేను మాట్లాడాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబం, స్నేహితుల కోసం ఆందోళన చెందుతున్నాము. 
 
మీలో చాలా మందికి ఇది వాస్తవమని మాకు తెలుసు. శాంతియుత నిరసనకారుల హక్కులను కాపాడేందుకు కెనడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మేము అనేక మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాము. మనమందరం ఒక్కతాటిపైకి రావాల్సిన తరుణమిది" అంటూ చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు "సర్కారు వారి పాట"కు వేలం తేదీ ఖరారైంది..