Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయవచ్చు: యష్, పుష్పలకు కంగనా వార్నింగ్

బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయవచ్చు: యష్, పుష్పలకు కంగనా వార్నింగ్
, సోమవారం, 24 జనవరి 2022 (17:10 IST)
దక్షిణాది తారలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్ ని సాధిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు.
 
ఇటీవల ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ పోస్ట్ పెట్టింది.
 
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.."సౌత్ కంటెంట్‌కి, సౌత్ స్టార్స్‌కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్‌, వృతిపరమైన నిబద్ధత అపారమైనది" అని పోస్ట్ చేసింది. 
 
ఇదే పోస్ట్‌లో "బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి" అంటూ పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్