Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగుపాటు-18మంది మృతి

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (16:13 IST)
monsoon storms
బంగ్లాదేశ్‌లో విషాదం నెలకొంది. పెళ్లి బృందం వెళ్తున్న పడవపై పిడుగు పడింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. చపాయ్‌నవాబ్‌గంజ్‌ జిల్లా షిబ్‌గంజ్‌లోని తెలిఖారిఘాట్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ పెళ్లి బృందం పద్మా నది ఒడ్డున పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్దానుకున్నారు. పడవలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. మొత్తం 20 మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
పడవ బయలుదేరిన కాసేపటికే కుండ పోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపుతో వాతావరణం భీకరంగా మారింది. ఆ సమయంలోనే పద్మానదిలో వెళ్తున్న పడవపై పిడుగు పడింది. స్పాట్‌లోనే 18 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
 
పిడుగుపాటు వల్లే అందరూ చనిపోయారని.. పడవ నీటిలో మునిగేలోపే వారు మరణించారని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనాకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో పెళ్లికొడుకు గాయపడగా, పెళ్లికూతురు సురక్షితంగా బయటపడిందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments