న‌గ‌రిలో పొంగిన అభిమానం, ఎమ్మెల్యే రోజాకు రోజాల‌తో అభిషేకం చేసిన జనం(Video)

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (16:06 IST)
నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే రోజాపై రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌... నేడు ఉప్పొంగిన అభిమానం... రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం అన‌డానికి ఇదో ఉదాహర‌ణ‌. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని తీవ్ర అస‌మ్మ‌తిని ఎదుర్కొన్న రోజాకి ఇపుడు అదే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆమె మంత్రి అవుతుంద‌నే ఊహాగానాల‌తో ఆమెని రోజా పూల‌తో ముంచెత్తుతున్నారు.
 
నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. వడమాలపేట మండలం తట్నేరిలో ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి దళిత వాడ రోడ్డు ను ప్రారంభించారు.
 
అలాగే, వైఎస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి 30 వేల రూపాయల వంతున ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు. 
 
పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా నెత్తిన రోజా పూలు త‌ట్ట‌ల కొద్ది జ‌ల్లి... ఆమెను రోజా పూ రెమ్మ‌ల‌తో ముంచెత్తారు. నాయ‌కులు, ప్ర‌జ‌ల అభిమానానికి రోజా ఉబ్బి త‌బ్బిబ‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments