Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌లో భారీ పేలుడు - ముగ్గురి మృతి

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (19:07 IST)
పాకిస్థాన్ దేశంలోని ప్రముఖ నగరమైన లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం రావాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో లాహోర్ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎక్కువగా భారతీయ వ్యాపారులు వ్యాపారం చేసుకునే ఏరియా అని, అందుకే ఈ పేలుడుపై అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. 
 
నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ను చేసుకుని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ఘటనా ప్రాంతంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు ఇప్పటివరకు ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. అయితే, పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఈ పేలుడు బైకులో అమర్చిన పేలుడు పదార్థాల వల్ల జరిగినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments