Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్‌లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (16:22 IST)
భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ అధ్వాన్నంగా తయారైంది. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం భారతదేశం నుంచి వీచే గాలులేనని పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి మరియం ఔరంగజేబ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వితండవాదం చేశారు.  
 
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ అట్టగుస్థాయికి పడిపోయింది. ఇక్కడ ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్‌కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. 
 
లాహోర్‌లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. భారత్ నుంచి వీచే గాలిని ఆపడం కుదరదని, ఆ దేశంతో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments