Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి: పసిడి ధరలు పైపైకి.. వెండి ధరలు కూడా అప్

Advertiesment
Gold Jewelry

సెల్వి

, శనివారం, 19 అక్టోబరు 2024 (13:23 IST)
దీపావళికి ముందు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడికి డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగిపోయాయి. బంగారంతో పాటు పెరిగే వెండి ధర భారీగానే పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. పసిడి ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.80 వేలకు చేరువైంది. స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో శుక్రవారం రూ. 79,900గా నమోదైంది. గురువారంతో పోలిస్తే పది గ్రాముల పసిడిపై రూ. 550 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వర్ణం ధరపై రూ. 870 పెరిగి రూ. 78,980కు చేరుకుంది. 
 
ఇకపోతే.. కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి రూ. 94,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 2 వేలు పెరిగి రూ. 1,05,000కు ఎగబాకింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 160 కోట్లతో డ్రీమ్ ప్రాజెక్ట్.. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం