శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఎవరు? (video)

సెల్వి
మంగళవారం, 5 నవంబరు 2024 (16:09 IST)
idols deities
శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం పూజారి పూజ చేసేందుకు వచ్చిన తర్వాత  కొన్ని విగ్రహాలు ధ్వంసమైనట్లు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దుండగులు ఆలయ గేటు తెరిచి రాళ్లతో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఈ ఘటనను ఖండించారు. ఆలయం ఉన్న ఎయిర్‌పోర్ట్ కాలనీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానంతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇకపోతే.. అక్టోబర్ నెల 24 అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఆలయం వద్దకు చేరుకొని నిందితులను పట్టుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు.
 
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహానికి లోనయ్యారు. ఈ అంశంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments