Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ నిర్బంధం అక్రమం : పాక్‌కు ఝలక్ ఇచ్చిన ఐసీజే

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీజే) తేరుకోలేని షాకిచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. పైగా, కుల్‌భూషణ్ నిర్బంధం అక్రమమని తేల్చింది. పైగా, దీనిపై తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. 
 
భారత గూఢచార సంస్థ 'రా' కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్‌భూషణ్‌ను 2016 మార్చి 3వ తేదీన పాకిస్థాన్ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. 
 
ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ గురువారం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments