Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 20న ఆప్ఘన్ ఎన్నికలు.. కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి

ఆప్ఘనిస్తాన్‌లో అక్టోబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌లో షియా తెగకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో మళ్

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (16:01 IST)
ఆప్ఘనిస్తాన్‌లో అక్టోబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌లో షియా తెగకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో మళ్లీ నెత్తురు పారింది. కాబూల్‌లో ఎడ్యుకేషనల్ సెంటర్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  
 
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే మారణహోమం సృష్టిస్తున్నారు. ఐతే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఇటీవల ఘాజ్ని నగరంపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. భద్రతా దళాలే టార్గెట్‌గా మెరుపు దాడికి పాల్పడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య ఐదు రోజుల పాటు భీకర కాల్పులు జరిగాయి. తాలిబన్ల దాడిలో 140 మంది భద్రతా సిబ్బంది, 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments