Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాకు ఇప్పట్లో విమానాలు లేనట్లే

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (11:02 IST)
భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది. అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా కెనడా అధికారులు వెల్లడించారు.
 
సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

కాగా, నేరుగా వచ్చే విమానాల ద్వారా కాకుండా ఇతర దేశాల గుండా కెనడా వచ్చే భారతీయులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూఏఈ‌తో పాటు ఇతర కొన్ని దేశాలు భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రయాణాలపై పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments