Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృత్యువాత

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (11:19 IST)
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. నిత్యం జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ బాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 80మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో పది మంది వరకు చనిపోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. 
 
ఇస్తాంబుల్ మార్కెట్‌ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి వస్తువులు పేలుడు ధాటికి గాల్లో ఎగిరి చిందరవందగా పడిపోయాయి. ఇందుకు సంభంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments