Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (15:09 IST)
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోమారు నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై అర్థరాత్రి భీకరమైన దాడులు చేశాయి. ఈ దాడుల్లో నిరాశ్రయులు, తలదాచుకుంటున్న నివాసాలు, శిబిరాలు లక్ష్యంగా మారడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 66 మంది పాలస్తీనియులు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
ఈ శాఖ లెక్కల ప్రకారం ఖాన్ యూనిస్‌లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్ధి శిబిరంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ తాజా దాడులపై ఇజ్రాయేల్ సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ నిరాకరించడం వల్లే ఈ దాడులను తీవ్రతం చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments