Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ట్రాక్‌పై పడిన కుమార్తెలు.. కాపాడిన టెక్కీ... చివరికి ఏమైందంటే?

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (10:09 IST)
ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పై పడిన తన కుమార్తెలను రక్షించే ప్రయత్నంలో ఇన్ఫోసిస్ టెక్కీ ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే, 40 ఏళ్ల ఆనంద్ రన్వాల్ సిడ్నీలో పనిచేసే ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి. 
 
ఆదివారం (జూలై 21) మధ్యాహ్నం 12.25 గంటలకు ఆనంద్ తన భార్య, కవల కుమార్తెలతో కలిసి కార్ల్‌టన్ స్టేషన్‌లో ఉన్నాడు. కుటుంబ సభ్యులు లిఫ్ట్‌పై నుంచి కిందకు దిగిన తర్వాత ప్రమాదవశాత్తు చిన్నారులు ఉన్న ప్రామ్ రైల్వే ట్రాక్‌పైకి బోల్తా పడింది.
 
ఆనంద్ తన కూతుళ్లను కాపాడేందుకు ప్లాట్ ఫామ్‌పై నుంచి రైల్వే ట్రాక్ పైకి దూకాడు. ఈ క్రమంలో పెద్ద కూతురుని కాపాడగలిగాడు. అయితే ఆనంద్, అతని చిన్న కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఆనంద్ భార్య, అతని కుమార్తెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇకపోతే.. ఆనంద్ అతని కుటుంబం 2023 చివరలో సిడ్నీకి మారారు. వారు సిడ్నీలోని కొగరా శివారులో ఉండేవారు. ఇటీవల, ఆనంద్ తల్లిదండ్రులు సిడ్నీలో అతనిని సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments