Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చెల్లించలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య (Video)

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాన్స్‌‍ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు. 
 
అయితే, తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడిన మారుతి.. సోమవారం పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు. పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధృవ వాయు నటించిన దర్శకత్వం వహించిన కళింగ మూవీ రివ్యూ

ఓజీ కోసం కలరిపయట్టును ప్రాక్టీస్ చేస్తోన్న శ్రీయా రెడ్డి

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

బంధీ టీజర్ రిలీజ్ - ప్రకృతిని కాపాడే పాత్రలో ఆదిత్య ఓం

క సినిమా నుంచి తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments