Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చెల్లించలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య (Video)

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాన్స్‌‍ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు. 
 
అయితే, తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడిన మారుతి.. సోమవారం పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు. పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments