సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (12:21 IST)
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్‌కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశాన్ని ఈ ప్రకృతి విపత్తు వణికించింది. 
 
సైక్లోన్ సెన్యార్‌ కారణంగా సుమిత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ లభ్యమైంది. ఈ వరదల వల్ల బ్రిడ్జ్‌ కూలిపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దాంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. 
 
పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు సమీపంలో ఉండే ఇండోనేసియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్‌ అనేది పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్‌ బెల్ట్‌. ఇక్కడే 90 శాతం భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలస్కాలోని అల్యూటియన్‌ ద్వీపాలు దీని పరిధిలోకి వస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments