విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున స్వల్ప ప్రకంపనలు సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 గంటల మధ్య ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
అయితే, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందనే వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
నగర ప్రజలు గాఢ నిద్రలో ఉండగా, భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు.