ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (09:17 IST)
ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత ట్రైయినీ పైలెట్ కూలిపోయింది. విమానం కూలిన ఘటనా స్థలాన్ని సిబ్బంది గుర్తించి, మృతుల కోసం గాలిస్తున్నారు. ఈ విమానం మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయ ట్రైనీ పైలెట్ రాజ్‌కుమార్‌ కొండేగా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విమానం అదృశ్యమైనట్టు వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది,  ఎయిర్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకిదిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయినట్టు తేలింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారతీయ ట్రైనీ ప్రైలెట్ మృతి చెందాడని అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments