Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై కాల్పులు, తీవ్ర గాయాలు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (13:00 IST)
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారతీయ విద్యార్థిపై జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం తెలిపారు. యుద్ధ సమయంలో రష్యా దళాలు జరుపుతున్న కాల్పుల సమయంలో విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.

 
 ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు సింగ్ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. విద్యార్థులను ఉక్రెయిన్ దేశానికి పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ నుండి ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు.
 
 
కాగా ఇప్పటికే మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ అనే భారతీయ వైద్య విద్యార్థి ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో తనకు, తన తోటి విద్యార్థులకు ఆహారం కొనడానికి బయటకు రాగా అతడు రష్యా దాడిలో మరణించాడు. 
వీలైనంత తక్కువ నష్టంతో ఉక్రెయిన్ నుండి విద్యార్థులను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సింగ్ చెప్పారు. 
 
రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments