Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ వ్యవస్థ తీరు అభ్యంతరకరంగా ఉంది.. వైకాపా ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (12:45 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా ఎమ్మెల్యే  కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై వైకాపాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 
 
రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమన్నారు. 
 
ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. కోట్లాది మంది ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే పాలన ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా పాలనను దెబ్బతీసే విధంగా దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments