న్యాయ వ్యవస్థ తీరు అభ్యంతరకరంగా ఉంది.. వైకాపా ఎమ్మెల్యే

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (12:45 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైకాపా ఎమ్మెల్యే  కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై వైకాపాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 
 
రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమన్నారు. 
 
ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. కోట్లాది మంది ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే పాలన ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా పాలనను దెబ్బతీసే విధంగా దుష్ట శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments