Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:23 IST)
కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనాలు రూపొందించింది.

అయితే భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకుంటున్న బ్రిటన్.. భారతీయులపై ఇలాంటి వివక్షాపూరిత విధానాలను మొపడం ఎంత మాత్రం సబబు కాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్వారంటైన్ విధానంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది.

యూకే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదని కూడా హెచ్చరించింది. సమస్య పరిష్కారానికి బ్రిటన్ నుంచి త్వరితగతిన హామీ రావాలని తాము కోరినట్లు, ఈ విషయమై తగిన హెచ్చరిక కూడా చేసినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.

విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కోవిడ్ నిబంధనల గురించి బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 4వ తేదీ నుంచి బ్రిటన్ వచ్చే భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ నిబంధనలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments