బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:23 IST)
కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనాలు రూపొందించింది.

అయితే భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకుంటున్న బ్రిటన్.. భారతీయులపై ఇలాంటి వివక్షాపూరిత విధానాలను మొపడం ఎంత మాత్రం సబబు కాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్వారంటైన్ విధానంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది.

యూకే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదని కూడా హెచ్చరించింది. సమస్య పరిష్కారానికి బ్రిటన్ నుంచి త్వరితగతిన హామీ రావాలని తాము కోరినట్లు, ఈ విషయమై తగిన హెచ్చరిక కూడా చేసినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.

విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కోవిడ్ నిబంధనల గురించి బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 4వ తేదీ నుంచి బ్రిటన్ వచ్చే భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ నిబంధనలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

నటి ప్రత్యూషను 10 మందితో గ్యాంగ్ రేప్ చేయించి చంపేసాడు, కుక్కచావు చస్తాడు: తల్లి ఆవేదన

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments