Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశం.. ప్రధాని షేక్ హసీనా

India
Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:14 IST)
Modi _Hasina
బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశమని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1971 యుద్ధంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినందుకు దేశానికి, భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 'డిసెంబర్ బంగ్లాదేశీయుల్లో ఆనందం, స్వేచ్ఛ, వేడుకల స్ఫూర్తిని రేకెత్తిస్తుందని' అన్నారు. 
 
భారత్‌ సారథ్యంలో తాము గొప్ప స్వాతంత్య్రాన్ని సంపాదించామన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మరణించిన మూడు మిలియన్ల మంది అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మా దేశం కోసం తమ హృదయపూర్వక మద్దతును అందించిన ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌ డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే 55 సంవత్సరాలుగా నిలిచిపోయిన చిలహతి, బెంగాల్‌ హల్దిబారి రైలు మార్గాన్ని ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments