Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూఢచర్యం ఆరోపణలు: పాక్‌లో మరో భారతీయుడి అరెస్టు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:50 IST)
తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణపై ఓ భారతీయుడిని పాకిస్థాన్ తాజాగా అరెస్టు చేసింది. రాజు లక్ష్మణ్ అనే వ్యక్తిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. 

బెలూచిస్థాన్ ప్రావిన్స్‌ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి ప్రవేశిస్తుండగా లక్ష్మణ్‌ను అరెస్టు చేసినట్టు పాక్ ప్రకటించింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ అంగీకరించాడనీ, అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాజుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా గూఢచార్య ఆరోపణలపై భారత మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు పాకిస్థాన్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్టే విధించి, శిక్షను పునఃపరిశీలించాల్సిందిగా పాకిస్థాన్‌ సర్కారును ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments